కాంగ్రెస్ పార్టీ తనను సీఎం చేస్తే రూ.1500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చెప్పారని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఆనాడు జగన్ తనకు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుందని ఆయన అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా మంగళవారం కడప ఎన్నికల సభలో పాల్గొన్నా ఆయన మాట్లాడుతూ ఇంత సొమ్ము ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబునాయుడు ఎప్పుడూ కూడ రాష్ట్రం గురించే ఆలోచిస్తారని ఆయన కొనియాడారు. ఈ ఇద్దరికి ఉన్న తేడా తనకు స్పష్టంగా తెలుస్తోందని, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఏ ప్రాంతంలో ఉంటున్నా, ఏం తింటున్నా మనమంతా భారతీయులమేనని ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. దేశమంతా ఏకమై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు.