telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఫోన్ ట్యాపింగ్ లో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది: అనిత

Anitha vangalapudi tdp

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ట్యాపింగ్ అంశాన్ని అత్యాచారంతో పోల్చిన హోంమంత్రి సుచరిత తీరు బాధాకరమని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు ఆధారాలు చూపించాలంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. టీడీపీ నేతలపై చేస్తున్న అవినీతి ఆరోపణలకు కూడా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.

స్వార్థ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని అనిత ఆరోపించారు. అమరావతికి మరణశాసనం రాస్తున్నారని అన్నారు. వైసీపీ నేతల భూకబ్జాలకు మాత్రమే విశాఖ రాజధాని అని చెప్పారు. చంద్రబాబు హయాంలో విశాఖకు వచ్చిన పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం వెళ్లగొడుతూ ఆ ప్రాంత అభివృద్ధిని నాశనం చేస్తోందని విమర్శించారు. జగన్ మెప్పు కోసమే కొందరు నేతలు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

Related posts