రేవంత్, అధిష్టానంపై వీహెచ్ మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్కు పీసీసీ చీఫ్ ఇస్తారని వార్తలు రావడంతో వీహెచ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ గ్రేటర్ లో 48 సీట్లు తీసుకుని ఎన్ని గెలిపించావని… వెంకట్ రెడ్డి రెండు మున్సిపాలిటీ లు గెలిపించారన్నారు. టీడీపీలో ఉండి టీడీపీని ఖతం చేశాడు రేవంత్… ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడు…దీన్ని ఖతం చేస్తారని ఫైర్ అయ్యారు. గతంలో సోనియాగాంధీని రేవంత్ బలి దేవత అన్నాడని… రేవంత్ rss నుండి టీడీపీలో చేరాడని…ఆయనపై చాలా కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. రేవంత్ తమ్ముడు దళితుల భూములు అక్రమించాడని… ఢిల్లీని కూడా మేనేజ్ చేస్తున్నాడన్నారు. ఆయనకు పీసీసీ పదవిస్తే నేను ఉండను… నేనే కాదు…ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారని స్పష్టం చేశారు వీహెచ్. పార్టీ కోసం పని చేసే జగ్గారెడ్డి పీసీసీకి పనికి రాడా… కోమటిరెడ్డి కూడా పనికి రాకుండా పోయిండా అని ఫైర్ అయ్యారు. తెలంగాణ వ్యతిరేకికి పీసీసీ ఇస్తే… మేము జైళ్ల చుట్టూ తిరగలా అంటూ అధిష్టానంపై మండిపడ్డారు. ఓ వైపు బీజేపీ పెరుగుతుంటే… rss వాడికి పీసీసీ ఇస్తారా..? అంటూ నిలదీశారు.
previous post
next post