లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజల వద్దకే సరుకుల పంపిణీని చేపడుతున్నామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంఇపణీ చేసేందుకు హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్కు వెళ్తున్న రవాణా వాహనాలను కాచిగూడలోని టూరిస్ట్ ప్లాజా హోటల్వద్ద జెండా ఊపి ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూకరోనా మహమ్మారి విజృంభిస్తున్నతరుణంలో ప్రజలు గుంపులు గుంపులుగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలన్నారు. ప్రజల కోసం మొబైల్ ఏటీఎంలు, మొబైల్ రైతుబజార్లను ఉపయోగించుకోవాలన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వలస కూలీలను ఆదుకుంటామన్నారు. వలస కూలీల కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తోందన్నారు.