తెలంగాణ సీఎం కేసీఆర్ కు నందమూరి రామకృష్ణ, తన ట్విట్టర్ ఖాతాలో కృతజ్ఞతలు తెలియజేసారు. తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రచురించడంపై సంతోషం వ్యక్తం చేసారు. ఇటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్ ప్రభుత్వానికి మరోసారి కృతజ్ఞతలు” అని నందమూరి రామకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. నందమూరి తారక రామారావుగారి జీవిత చరిత్రను ఓ పాఠ్యాంశంగా చేర్చాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము” అని పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఈ నిర్ణయంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనందరికీ గర్వకారణం.ఎన్టీఆర్ జీవిత చరిత్ర తరతరాల విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుంది. ఆయన జీవితంలోని క్రమశిక్షణ, నిజాయతీ తదితరాలను గురించి ఈ తరం విద్యార్థులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఏపీ గవర్నర్ ప్రసంగంలో 3 రాజధానుల ప్రస్తావన!