గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచారంలో బిజీ అయిపోయాయి. ప్రచారంలో భాగంగా బీజేపీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ “బస్తీ నిద్ర” కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో తనతోపాటు, పార్టీకి చెందిన సీనియర్ నాయకులు “బస్తీ నిద్ర” చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు తాను “బస్తీ నిద్ర” చేస్తానని ప్రకటించారు. “బస్తీ నిద్ర” కార్యక్రమంలో సామాన్యులు నివసించే ప్రాంతాల్లోనే నిద్ర చేయాలని, బస్తీల్లో ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వారితో మమేకం కావాలని కోరారు. బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన తరువాత కూడా “బస్తీ నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారనే విషయాన్ని ” బిజెపి బస్తీ నిద్ర ” కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
previous post
‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై నాగబాబు కామెంట్స్