బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసుపై సీబీఐ లోతుగా విచారణ జరుపుతున్న క్రమంలో రోజుకో కొత్త ట్విస్ట్ బయటకొస్తోంది. తాజాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుశాంత్ మృతి నేపధ్యంలో డ్రగ్స్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ పోలీసులు ఇవాళ ముంబైలో రియాని అరెస్టు చేశారు. ఎన్డీపీఎస్లో వివిధ సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజుల నుంచి రియాను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో తనకు డ్రగ్స్ అలవాటు ఉందని రియా ఒప్పుకుంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా కూడా డ్రగ్స్ రాకెట్ పై పలువురిని టార్గెట్ చేసి మాట్లాడింది. అయితే కంగనా కూడా ఈ ఉచ్చులో చిక్కుకుందని తెలుస్తుంది. కంగనా రనౌత్కు డ్రగ్స్ అలవాటు ఉందనే విషయమై విచారణకు ఆదేశించినట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ తెలిపారు. గతంలో అయ్యదన్ సుమన్ అనే వ్యక్తికి కంగనా బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసే ప్రయత్నం చేసిందని అతడే స్వయంగా చెప్పాడని హోంమంత్రి పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో అయ్యదన్ సుమన్ అనే వ్యక్తి తనకు కంగనాకు సంబంధం ఉందని, ఆమె డ్రగ్స్ తీసుకుంటుందని తనను కూడా డ్రగ్స్ తీసుకోవాలని బలవంత పెట్టిందని అన్నాడు. ముంబై పోలీసులు ఈ విషయమై విచారణ చేయనున్నారు అని హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ తెలిపారు.
previous post
next post