telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

కుప్పం పర్యటనలో బాబు .. పార్టీ పిటాయింపులపై విసుర్లు..

2nd day tour by chandrababu in kuppam

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండు రోజులుగా కుప్పం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి టీడీపీ పార్టీ నేతలకు, కార్యకర్తలకు దైర్యం చెప్పారు. అలాగే పార్టీ ఫిరాయింపుదారులపై విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం టీడీపీ కార్యాలయంలో ఈరోజు సమీక్షించారు. ఎన్నికల్లో ఆధిక్యం తగ్గడంపై పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, స్వలాభం కోసం పార్టీ మారితే అవకాశ వాదం అవుతుందని అన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన విధివిధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓడినప్పుడు అధైర్యపడొద్దని, అది నాయకత్వ లక్షణం కాదని అన్నారు.

Related posts