telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రతి ఒక్కరికి ఉచితంగా కరోనా టీకా : కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ 

Nirmalasitaraman

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్  బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేశారు. బీహార్ రాష్ట్ర ప్రజలు రాజకీయంగా చాలా సున్నితంగా ఉంటారని..వారికి రాజకీయ పరిజ్ఞానం కూడా ఎక్కువనే అని పేర్కొన్నారు. పార్టీలు చేసే వాగ్ధానాలను వారు అర్ధం చేసుకుంటారని ఆమె అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం హయాంలో..బీహార్ లో జేడీపీ బాగా పెరిగిందన్నారు. 3 శాతం నుంచి 11.3 శాతానికి గత 15 ఏళ్ళ ఎన్డీయే ప్రభుత్వంలో పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత..బీహార్ లో ప్రతి పౌరుడికి ఉచితంగా ఆ టీకా ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. మా ఎన్నికల మేనిఫెస్టోలో మేం చేసిన తొలి వాగ్దానం ఇదే అని మంత్రి అన్నారు. పాట్నాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నిర్మలా..బీహార్ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఎన్డీయే కు ఓటేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. మరో ఐదేండ్ల పాటు నితీష్ కుమార్ సీఎం గా ఉంటారని పేర్కొన్నారు. ఆయన పాలనలో బీహార్ ఉత్తమ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి నిర్మలా చెప్పారు. 

Related posts