గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ శాసనసభ్యురాలు విడదల రజని తమపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైసీపీ ఎమ్మెల్యే రజనిపై అభ్యంతరకరమైన రీతిలో ఫేస్ బుక్, వాట్సాప్ లలో పోస్టులు పెడుతున్నారని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.
దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. బాలాజీసింగ్, పి.కోటేశ్వరరావు అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పట్టణ సీఐ సూర్యనారాయణ వెల్లడించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు: సుజనా చౌదరి