రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఉద్యమంలా ముందుకు సాగుతోంది. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవి ఇచ్చిన పిలుపును స్వీకరించిన టాలీవుడ్ రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ రోజు చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం తన స్నేహితులు చెన్నై బ్యూటీ శృతిహాసన్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ లకు సవాల్ విసిరారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ గారిని మనసారా అభినందిస్తున్నట్టు దేవీ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు నామినేట్ చేయడం పట్ల హారీశ్ శంకర్, శృతిహాసన్ లు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే తన మూడు మొక్కలు నాటతామని తెలియజేశారు.
Rockstar @ThisIsDSP accepted #GreenindiaChallenge 🌱 by @MythriOfficial and planted saplings with nephew and mother.
Thanked @MPsantoshtrs for leading.
Further nominated @harish2you & @shrutihaasan to continue the chain. 💚 #HarithaHaaram pic.twitter.com/EcIgXBATpU
— BARaju (@baraju_SuperHit) July 28, 2020
రష్మిక పిక్ పై కలెక్టర్ కామెంట్… షాక్ లో నెటిజన్లు