telugu navyamedia
రాజకీయ

షుజా మా సంస్థలో ఉద్యోగి కాదు: ఈసీఐఎల్

OU students wrote letter to EC
సైబర్‌నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్ సుజా తమ సంస్థలో ఉద్యోగి కాదని ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) తెలిపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను రూపొందించిన ఈసీఐల్‌ నిపుణుల బృందంలో తానూ ఒకడినని షుజా తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై స్పందించిన ఈసీఐఎల్.. ఈవీఎంల రూపకల్పనకు షుజాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
ఆయన తమ సంస్థలో ఉద్యోగి కాదని ఈసీఐఎల్‌ స్పష్టం చేసింది. 2009-14 వరకు ఈసీఐఎల్‌లో పనిచేసినట్లు ఆయన చెబుతున్నారని, కానీ అది వాస్తవం కాదని పేర్కొంది. ఈవీఎంలను హ్యాకింగ్‌ చేసి 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రయోజనం పొందిందని సయ్యద్‌ షుజా అనే నిపుణుడు వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Related posts