పౌరసత్వ చట్టంపై వెల్లు విరుస్తున్న నిరసనలతో దేశ రాజధాని ఢిల్లీ సైతం అట్టుడికే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనల పట్ల సోనియా గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. నాడు ఇందిరాగాంధీ పాలనలో ఢిల్లీ సెంట్రల్ వర్శిటీ విద్యార్థులను తీహార్ జైలుకు పంపలేదా అని ప్రశ్నించారు.
ఇందిర చర్యల కారణంగా ఆ ఏడాది విద్యార్థులు ఓ విద్యాసంవత్సరాన్ని కోల్పోయారని గుర్తుచేశారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ దుష్ప్రచారానికి పాల్పడుతోందని నిర్మల మండిపడ్డారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు తరలివచ్చిన శరణార్థులను ఆదుకోవాలని మన్మోహన్ సింగ్ కోరారని, మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని నిలదీశారు.
ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్రెడ్డి