ఇటీవల ఏపీలో శాంతిభద్రతలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఎన్నికల అనంతరం ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరా తీసింది. ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయంటూ రాష్ట్ర డీజీపీ ఇచ్చిన నివేదికను గోపాలకృష్ణ ద్వివేది సీఈసీకి పంపారు.
ఈ నెల 10న తనకూ, చంద్రబాబుకు మధ్య జరిగిన సంభాషణ తాలూకు వీడియోను ఇంగ్లీషులోకి అనువదించి సీఈసీకి ద్వివేది పంపించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో ఈవీఎంల తరలింపుపై మరోసారి ఆ జిల్లా కలెక్టర్ను వివరణ కోరుతామని ద్వివేది తెలిపారు.
అలా చేస్తే వారు నోరు మూస్తారు.. బీజేపీ నేత ముండే సంచలన వ్యాఖ్యలు!