telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటిటిలో మరో ఆగిపోయిన బాలయ్య సినిమా ?

NBK

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల తాను స్వయంగా దర్శకత్వం వహించి, నటించిన “నర్తనశాల” సినిమాను విడుదల చేసిన విషయం తెలిసిందే. బాలయ్య అర్జునుడుగా, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ కుమార్ నటించారు.ఇక ద్రౌపతిగా అందాలనటి సౌందర్య నటించింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించింది. దాంతో ‘నర్తనశాల’ సినిమా మధ్యలో ఆగిపోయింది. అయితే 17 నిముషాలు చిత్రీకరించిన ఈ సినిమాను అభిమానుల కోరిక మేరకు 17 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పడు బాలకృష్ణ నటించిన మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘విక్రమ సింహ భూపతి’ అనే సినిమాను మొదలు పెట్టారు. సగం షూట్ పూర్తి అయిన ఈ చిత్రం కొన్ని టెక్నికల్ ఇష్యూల కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాను షూటింగ్ పూర్తయిన అంతవరకు ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Related posts