జేవీసీ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక సంస్థ భారత మార్కెట్లో 6 నూతన ఎల్ఈడీ టీవీలను తాజాగా విడుదల చేసింది. 24 నుంచి 39 ఇంచుల డిస్ప్లే సైజ్లలో ఈ టీవీలు విడుదలయ్యాయి. వీటి ప్రారంభ ధర రూ.7,499గా ఉంది.
ఈ సిరీస్లో విడుదలైన జేవీసీ 32ఎన్3105సి మోడల్ టీవీ ధర రూ.11,999 ఉండగా ఇందులో 1 జీబీ ర్యామ్, క్వాడ్కోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్లను ఏర్పాటు చేశారు. మిరాక్యాస్ట్ స్క్రీన్ క్యాస్టింగ్కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 3 హెచ్డీఎంఐ పోర్టులు, 2 యూఎస్బీ పోర్టులు, వైఫై తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఈ టీవీల గరిష్ట ధర రూ.16,999 గా ఉంది.