telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీవారిని దర్శించుకున్న మంచు లక్ష్మీ, విష్ణు

ఈరోజు ఉదయం మంచు లక్ష్మి, ఆమె సోదరుడు మంచు విష్ణుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడాడు. తిరుపతిలో తన తండ్రి మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా షూటింగ్ ప్రారంభమైందని చెప్పాడు. అలాగే కాజల్ అగర్వాల్ తో కలిసి తాను నటించిన ‘మోసగాళ్లు’ సినిమా త్వరలోనే విడుదల కానుందని అన్నాడు. ఈ సందర్భంగా తాను స్వామివారిని దర్శించుకున్నానని తెలిపాడు. వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వరుని సేవలో పాల్గొన్న వీరిద్దరు మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. అలాగే, ఆలయ అధికారులు వారిద్దరికి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం విష్ణుతో లక్ష్మి ఫొటో తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

Related posts