telugu navyamedia
రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు!

Republic Day Celebrations Hyderabad

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు త్వరలోనే కొత్త గవర్నర్లను నియమించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా గవర్నర్ల నియామకంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అయితే, ఓ తెలుగు రాష్ట్రానికి గవర్నర్ గా నరసింహనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమిత్ షాతో భేటీ అనంతరం నరసింహన్ మాట్లాడుతూ త్వరలోనే తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. భవనాల కేటాయింపు వంటి సమస్యలు ఓ కొలిక్కివస్తాయని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచి తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ, ఏపీ కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో ఆయన హైదరాబాద్, అమరావతి మధ్య రాకపోకలు కొనసాగిస్తున్నారు.

Related posts