టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి వైసీపీప్రభుత్వం పై మండిపడ్డారు. టీడీపీ నేతలు సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టగా చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు విధానాలే ప్రధాన అజెండాగా రాష్ట్ర పరిపాలన సాగుతోందని ఆరోపించారు. సీఎం జగన్ తమపై దాడులు చేయిస్తూ సంతోషపడుతున్నారని విమర్శించారు.
పరిపాలన వదిలేసి తమపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా అని ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. రివర్స్ పాలన కారణంగా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని అన్నారు. పాలనలో సలహాదారులే చక్రం తిప్పుతున్నారని అన్నారు. వారికి ముడుపులు ముడితేనే ఏ పథకమైనా ముందుకు వెళుతుందని ఆరోపించారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలి: పత్తిపాటి పుల్లారావు డిమాండ్