telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

అపోలో ఆస్పత్రి వద్ద భద్రత పెంపు…

Rajinikanth

రామోజీ ఫిల్మ్ సిటిలోని విలేజ్ సెట్ లో అన్నాత్తే సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు రజినీకాంత్. డిసెంబర్ 29 వరకు  అన్నాత్తే షూటింగ్ జరగాల్సి ఉంది. అయితే  అన్నాత్తే చిత్ర బృందంలో నలుగురికి పాజిటివ్ రావడంతో సినిమా షూటింగ్ నిలిపి వేశారు దర్శకుడు శివ, నాలుగు వారాల పాటు చిత్రీకరణ  వాయిదా వేస్తూ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 22 న రజినీకాంత్ కు అపోలో వైద్యులు  కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా ఆ వైద్య పరీక్షల్లో రజినీకాంత్ కు కరోనా నెగిటివ్ అని వచ్చింది. ఈ రోజు ఉదయం రక్తపోటు అధికం కావడంతో రజినినీ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు సిబ్బంది. డాక్టర్ కె.హరిబాబు పర్యవేక్షణలో రజినీకాంత్ కు వైద్య పరీక్షలు జరిగాయి. అన్నాత్తే సినిమా కోసం రోజుకు 14 గంటల పాటు పని చేసిన రజినీకాంత్ కు అస్వస్థత ఏర్పటినట్టు చెబుతున్నారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన నేపథ్యంలో రజినీ అస్వస్థతతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వద్దకు అభిమానులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో అపోలో ఆస్పత్రి వద్ద భద్రత పెంచారు.. పేషేంట్లను, అటెండర్లను మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. కొత్త వాళ్ళను లోపలికి అనుమతించడం లేదు. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని సాయంత్రానికి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Related posts