telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలి: పత్తిపాటి పుల్లారావు డిమాండ్

అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని టీడీపీ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేపు జరిగే మంత్రి వర్గ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించుకోవాలన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నిర్ణయం చేయాలన్నారు. రాష్ట్ర కేబినెట్ భేటీ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానలు ప్రకటన చేసి ఆ మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని ఆరోపించారు.

అమరావతికోసం భూములిచ్చి త్యాగాలు చేసిన రైతులను రోడ్డు మీదకు తెచ్చారని పేర్కొన్నారు. వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ.. కించపర్చేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశంలో అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం వస్తే.. ఎల్లుండి రాష్ట్ర బంద్ కు పిలుపు ఇస్తామని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వం కావాలనే ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు.

Related posts