telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నా కులం మాట నిలబెట్టుకునే కులం: సీఎం జగన్

ys jagan cm

నా కులం మాట నిలబెట్టుకునే కులమని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ రోజు గుంటూరులో ‘వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా’ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవలి కాలంలో కొందరు తన మతం, కులం గురించి మాట్లాడుతూ, దారుణమైన విమర్శలు చేస్తున్నారని అన్నారు.

నా మతం మానవత్వం అని, నా కులం మాట నిలబెట్టుకునే కులం అని స్పష్టం చేశారు. ఓ గొప్ప కార్యక్రమానికి నేడు అంకురార్పణ జరిగిందని, వైద్యం చేయించుకునేందుకు ఇకపై ఏ పేదవాడూ ఇబ్బందులు పడబోడని హామీ ఇస్తున్నానని అన్నారు. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.

కాగా, ఆరోగ్య శ్రీలో భాగంగా 26 విభాగాల్లో 836 శస్త్రచికిత్సలకు ఆర్థికసాయం వర్తించనుంది. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే కాలంలోనూ ఆర్థికసాయం అందుతుంది. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 150కి పైగా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ పథకాన్ని అందిస్తాయని జగన్ గుర్తు చేశారు.

Related posts