telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ముగిసిన మూడో రోజు ఆట…

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం రెండో టెస్ట్ నడుస్తుంది. అయితే చెన్నై వేదికగా జరుగుతున్న ఈ రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన.. ఒక వికెట్‌ నష్టపోయి 54 పరుగులు చేసింది. ఇక ఈరోజు ఆటలో 286 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. భారత ఆల్ రౌండర్ అశ్విన్ శతకంతో రాణించగా కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఇక ఈరోజే తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. అందులో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా అశ్విన్ ఒక వికెట్ సొంతం చేసుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ ఇంకా తమ విజయానికి 429 పరుగుల దూరంలో ఉండగా భారత్ 7 వికెట్ల దూరంలో ఉంది. మరి చూడాలి రేపు నాలుగో రోజు ఆటలో ఏం జరుగుతుంది … భారత్ ఆ 7 వికెట్లు తీసే రేపే విజయాన్ని సొంతం చేసుకుంటుందా… లేదా అనేది.

Related posts