telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సింగపూర్ లో కాజల్ మైనపు విగ్రహం

Kajal

2007లో “చంద‌మామ”గా వచ్చి కుర్రాళ్ళ మనసుల్ని కొల్లగొట్టింది కాజల్ అగర్వాల్. అందాల చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. కాజ‌ల్ ఇటీవలే కోమ‌లి, రణ‌రంగం చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో “కోమలి” చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్లో ” ముంబై స‌గ” అనే చిత్రంలో జాన్ అబ్ర‌హంతో రొమాన్స్ చేయ‌నుంద‌ట‌. సంజ‌య్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నార‌ని స‌మాచారం. ఇక ఆమె న‌టించిన‌ “పారిస్ పారిస్” కూడా విజయం సాధిస్తుందని కాజల్ ధీమాగా ఉంది. మరోవైపు కమల్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “భారతీయుడు-2″లో నటిస్తోంది. ఇదీ కాక శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్యతో జ‌త‌క‌ట్ట‌నుంది కాజ‌ల్‌. “కాల్ సెంటర్” అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. దాదాపు అన్ని దేశీయ భాష‌ల‌లో న‌టిస్తూ అభిమానుల ఆద‌రాభిమానాలు పొందుతున్న ఈ అమ్మ‌డి క‌ల తాజాగా నెర‌వేరింది. ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్ సంస్థ ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్ధం సింగ‌పూర్‌లోని మ్యూజియంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మైనపు విగ్ర‌హాన్ని ఉంచ‌నున్న‌ట్టు తెలిపింది. ఇప్ప‌టికే ఈ అమ్మ‌డి కొల‌త‌లు కూడా తీసుకోగా, ఫిబ్ర‌వ‌రి 5, 2020 నుండి ప్ర‌జ‌ల‌కి అందుబాటులోకి రానుంది. ఈ విష‌యం తెలుసుకున్న కాజ‌ల్ సంతోషం వ్య‌క్తం చేస్తుంది.

Related posts