telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ అందమైన పాట 25 ఏళ్లు పూర్తి చేసుకుంది… నాగ్ ట్వీట్

Nagarjuna

నాగార్జున నటించిన సినిమాల్లో “క్రిమినల్” ఎవర్ గ్రీన్ మూవీ. 25 ఏళ్ళ క్రితం మహేష్ భట్ దర్శకత్వంలో క్రిమినల్ చిత్రం తెరెక్కింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. తెలుగులో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా ముఖ్య పాత్రలు పోషించగా, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ కొందరు ఎంతో ఇష్టంగా వింటుంటారు. ఇక ఈ సినిమాలో ‘తెలుసా… మనసా… ఇది ఏనాటి అనుబంధమో ..” అంటూ సాగే పాట ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. అయితే తాజాగా మరోసారి ఈ పాట హాట్ టాపిక్‌గా మారింది. మరోసారి ఈ పాటకు సంబంధించిన హిందీ, తెలుగు వర్షెన్‌ని అనూప్ శంకర్ స్వయంగా పాడి సమాజానికి సేవ చేసే నిస్వార్థ హృదయాలకు అంకితమిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “ఈ పాటను నిస్వార్ధ సేవ చేస్తున్న వారికి అంకితం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కీరవాణి స్వరపరచిన ఈ అందమైన పాట 25 ఏళ్లు పూర్తి చేసుకుంది” అంటూ నాగ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తెలుసా మనసా పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, పాటను బాలు, చిత్ర అద్భుతంగా ఆలపించారు.

Related posts