telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

1000 పేద కుటుంబాలకు గోపీచంద్ సాయం… రియల్ హీరో అనిపించుకుంటున్నాడు…!

Gopichand

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు సినిమా హీరోలు పేదవారికి అండగా నిలుస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన తెలుగు సినిమా కార్మికులకు అండగా తామున్నామంటూ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి భారీగా విరాళాలు అందజేశారు. ఈ ఛారిటీ ద్వారా ఇప్పటికే రూ.7 కోట్లకు పైగా సేకరించారు. ఈ డబ్బుతో సినీ పరిశ్రమలోని రోజువారీ వేతనానికి పనిచేసే కార్మికుల కుటుంబాలకు నెల రోజులకు సరిపడే నిత్యావసరాలన్నింటినీ అందజేస్తున్నారు. అయితే, ఈ ఛారిటీకి విరాళం ఇవ్వడమే కాకుండా స్వయంగా తమవైపు నుంచి కూడా సాయాన్ని అందజేస్తున్నారు తెలుగు సినీ ప్రముఖులు. హీరో గోపీచంద్ ఇప్పటికే సీసీసీకి విరాళం అందజేశారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లోని 1000 పేద కుటుంబాలకు నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను అందజేశారు. గోపీచంద్ స్వయంగా నిత్యావసర సరుకులను అందజేస్తోన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ గోపీచంద్ రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. గోపీచంద్‌తో పాటు ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి కూడా తన పెద్ద మనసు చాటుకున్నారు. 50 పేద కుటుంబాలకు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పోసాని అందజేశారు.

Related posts