telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అతిలోకసుందరి శ్రీదేవి వర్ధంతి… కుమార్తె జాన్వీకపూర్ భావోద్వేగం

sridevi-janvikapoor

అతిలోకసుందరి శ్రీదేవి మరణించి నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. 2018 ఫిబ్రవరి 24 లొ అతిలోకసుందరి అని పిలిపించుకున్న శ్రీదేవి మరణించి నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. 2018లో శ్రీదేవి కన్నుమూసినప్పటికీ, ఈ నాటికి ఆమె మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవి రెండవ వర్ధంతి సందర్భంగా ఆమె కుమార్తె జాన్వీకపూర్ ఒక పోస్ట్ చేసింది.జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన తల్లితో పాటు ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో జాన్వీ తన తల్లి శ్రీదేవిని ఆలింగనం చేసుకుని కనిపిస్తోంది. ఆ ఫోటో కింద జాన్వీ ‘నేను నిన్ను ప్రతీరోజూ మిస్ అవుతున్నానని’ రాసింది.ఈ ఫొటోను చూసిన శ్రీదేవి అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నారు. శ్రీదేవి ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts