telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చీక‌టిలో ఉన్నప్పటికీ ప్ర‌కాశిస్తూనే ఉన్నా… బిగ్ బి ఎమోషనల్ పోస్ట్

Amitab

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ ఆస్పత్రి నుంచి మరో సందేశం ఇచ్చారు. తన అభిమానుల్ని ఉద్దేశిస్తూ బాలీవుడ్ మెగాస్టార్ భావోద్వేగంతో కూడిన పోస్టు చేశారు. త‌న‌పై కొండంత ప్రేమ‌ కురిపిస్తోన్న అభిమానులను న‌మ‌స్క‌రిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రాములో ఓ ఫోటో పోస్ట్ చేశారు అమితాబ్. తనతో పాటు, అభిషేక్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యల కోసం ప్రార్థనలు చేస్తోన్న అభిమానులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు అమితాబ్‌ పేర్కొన్నారు. కుండ‌పోత వ‌ర్షంలా అభిమానులు కురిపిస్తున్న ప్రేమ వ‌ర్షం అన్ని క్లిష్టమైన అడ్డుగోడ‌ల‌ని కూడా బద్దలు కొడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభిమానుల అపార‌మైన ప్రేమ‌లో తాను పూర్తిగా త‌డిసిపోయానని పేర్కొన్నారు. తాను ప్రస్తుతం చీక‌టిలో ఉన్నప్పటికీ ప్ర‌కాశిస్తూనే ఉన్నాని చెప్పారు. అందరికీ శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నానని చెప్పారు. ఇక అమితాబ్ బచ్చన్‌తో పాటు అభిషేక్ బచ్చన్ కూడా నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా అమితాబ్ నానావతి ఆస్పత్రి సిబ్బందిపై ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రాణాలకు తెగించి మరి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా వైద్యసిబ్బంది అందర్నీ ఆయన భగవంతుడితో సరిపోల్చుతూ ప్రశంసలు కురిపించారు. ఆ భగవంతుడే వారందరికీ అండగా ఉంటాడని పేర్కొన్నారు. కోవిడ్ బారిన పడిన ఐశ్వర్య, ఆమె కుమార్తె ఆరాధ్య ఇంట్లోనే ఉంటూ కరోనా చికిత్స పొందుతున్నారు.

Related posts