telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

వేడిపాలల్లో బెల్లం కలిపి తాగితే…కరోనాకు చెక్ !

సాధారణంగా పాలలో చక్కెరను కలుపుకుని సేవిస్తుంటారు. అదే బెల్లం కలుపుకుని తాగితే… అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెపుతున్నారు. ఎందుకంటే… బెల్లం, పాలలో ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు. రోజూ వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందవచ్చు. ముఖ్యంగా బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగడం వ‌ల్ల వాటిలో ఉండే పోష‌కాలు అంది జుట్టు కాంతివంతంగా మారుతుంది. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. చుండ్రు పోతుంది. ఇకపోతే.. బెల్లంకు అనీమియా ఎదుర్కొనే శక్తి ఉంది. మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను తీసుకోవడం ఎంతే శ్రేయస్కరమని చెపుతున్నారు. బెల్లం కలిపిన పాలను తాగడం వల్ల మహిళలకు రుతుక్రమంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను, మెటాబలిజమ్ ను మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. ఈ పాలు తాగడం వల్ల కరోనాను జయించే రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. 

Related posts