దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ షూటింగ్ ముగిసిన విషయం తెలిసిందే. తాజా గా చిత్రబృందం అంత హైదరాబాద్ వచ్చేసింది. హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరీస్ కూడా భాగ్యనగరంలో ప్రత్యేక్షమైంది. ఈ విదేశీ బ్యూటీ హైదరాబాద్ వీధుల్లో తెగ సందడి చేసింది.
సిటీ విధుల్లో చిరుతిళ్ళు, పానీపూరీలు తింటూ కనిపించింది. ఆమె వెంటే ‘ఆర్ఆర్ఆర్’ కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరిస్తున్న అనురెడ్డి కూడా వుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్స్టా వేదికగా షేర్ చేశారు.ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్లు హీరోలుగా నటిస్తున్నారు. ఇక అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర విడుదల తేదీపై త్వరలోనే ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
450 కోట్ల భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటోన్నఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరీస్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఫ్రీ భోజనం కోసమే ప్రెస్ మీట్లకు..జర్నలిస్టులపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు