సాయితేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రిపబ్లిక్. ఐశ్వర్య రాజేష్ కథానియిక. జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రను పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్లుక్ ను చిత్రం బృందం ఇటివలే రిలీజ్ చేసింది. పొలిటికల్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న “రిపబ్లిక్” టీజర్ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ సోమవారం రిలీజ్ చేశారు. ఈ టీజర్లో సాయిధరమ్ తేజ్ నటన, డైలాగ్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీస్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జె. భగవాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మూవీ జూన్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా.. సాయి ధరమ్ తేజ్ ఇటీవల రిలీజ్ చేసిన… సోలో బ్రతుకే సో బెటర్ పెద్దగా ఆకట్టుకోలేదు.
previous post