telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షల చెక్ అందజేసిన దిల్ రాజు

dil-raju

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమంతటతాముగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తరపున ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పున ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ఇవ్వనున్నట్టు తెలిపారు. తాజాగా ఈ రోజు దిల్ రాజు రూ.10 లక్షల చెక్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేసారు.

Related posts