శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరదతో నాగార్జున సాగర్ వేగంగా నిండుతోంది. సాగర్ నుంచి నీటిని తెలంగాణ మంత్రులు విడుదల చేశారు. ప్రాజెక్ట్ నుంచి కుడి, ఎడమ కాల్వలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్రెడ్డి, ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నీటిని విడుదల చేశారు. సాగర్ ఆయకట్టు కింద ఎడమ కాల్వ ద్వారా నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
దీంతో పాటు ఎత్తిపోతల పథకాలైన లో లెవల్ కెనాల్, ఏఎమ్మార్పీ కాల్వలకు కూడా మంత్రులు సాగునీరు విడుదల చేశారు. మరోవైపు కుడికాల్వ ద్వారా ఏపీలో 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.