telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఏ క్షణమైన పిడుగులాంటి వార్త వినాల్సి వస్తోంది ..సిద్ధం కండి .

ఖమ్మం మాజీ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్య నేత తుమ్మల నాగేశ్వరరావు ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించిన తుమ్మ‌ల నాగేశ్వరరావు.. తన అనుచరులతో సమావేశమయ్యారు.. ముందస్తు ఎన్నికల గురించి కార్యకర్తలకు చూచాయగా సిగ్నల్స్​ ఇచ్చారు.

ఏ క్షణమైన పిడుగులాంటి వార్త వినాల్సి వస్తోంది.. కార్యకర్తలంతా సిద్దంగా ఉండాలని సూచించారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానన్న తుమ్మల.. ఈసారి మాత్రం పాలేరుపైనే దృష్టిపెట్టినట్టు స్పష్టం చేశారు.

మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పైనే దృష్టి పెట్టడం వలన కార్యకర్తలతో కలవలేక పోయానని, ఇప్పుడు పూర్తి సమయం కెటాయిస్తానని అన్నారు . ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తే మిగిలిన పనులన్ని పూర్తి చేస్తానన్నారు.

గతంలో దొర్లిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని కార్యకర్తలకు తుమ్మల సూచించారు. గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగానని, ఇప్పుడు మాత్రం పాలేరు పైనే ఫోకస్ పెడతానని తుమ్మల అన్నారు.

తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్.. ఆ ప్రచారాన్ని ధృవీకరిస్తున్నాయని చాలామంది భావిస్తున్నారు.

Related posts