స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ..ఎన్టీఆర్ కుమార్తెలు, కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్కు చేరకుని నివాళులర్పించారు.
నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.ఈ క్రమంలో ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి నివాళులర్పించారు. అనంతరం తన తండ్రిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. .
ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు ఒక సంచలనం.. ప్రభంజనమన్నారు.ఎన్టీఆర్ అనే పేరు ప్రతి తెలుగింటి గడప బతికున్నంత కాలం గుర్తుంటుందని అన్నారు
రూ.వంద నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రణ గురించి తాము ఆర్బీఐతో మాట్లాడుతున్నామని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
నేటి నుంచి వచ్చే ఏడాది మే 28 వరకూ ఈ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. ఏపీ, తెలంగాణలో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు
ఉత్సవాల నిర్వహణలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 12 కేంద్రాలను గుర్తించామని అన్నారు. ఆయా కేంద్రాల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
ఉత్సవాల నిర్వహణ పర్యవేక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. బాలకృష్ణ, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు ఆ కమిటీలో ఉన్నారు. అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారిని ఘనంగా సత్కరించనున్నామని పురందేశ్వరి తెలిపారు.