నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఈ తెల్లవారుజామునే హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్లు తాతను నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి తాతను స్మరించుకున్నారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నేడు ఘనంగా జరుపుకుంటున్నారు. తమ అభిమాన కథానాయకుడు, మహానాయకుడిని ప్రజలు స్మరించుకుంటున్నారు