వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ‘మర్డర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ఫాదర్స్ డే సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కుటుంబ కథా చిత్రమ్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో అమృత పాత్రలో ఆవంచ సాహితి, మారుతిరావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదిని ఆర్జీవీ ట్విటర్ వేదికగా ప్రకటించారు. జూలై 28వ తేదీ ఉదయం 9.08 గంటలకు ట్రైలర్ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఐదు భాషల్లో ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు చెప్పారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే సారి ట్రైలర్ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లను సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ అమృత, మారుతీరావుల పాత్రలను పరిచయం చేశారు.
next post