*జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో మరో ముగ్గురు నిందితుల అరెస్ట్
*కర్ణాటక తమిళనాడులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..
*ఇప్పటికే ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
*నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు
జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారంలో కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శనివారం తమిళనాడు, కర్నాటక లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ రేప్ కేసులో పోలీసుల అదుపులో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నారు. బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు విచారణ కొనసాగుతుంది. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
మే 28న కొందరు విద్యార్థులు జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లో పార్టీ చేసుకున్నారు. కొందరు స్నేహితులూ ఆ పార్టీకి వచ్చారు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి బాలిక పబ్కు వెళ్లింది. పబ్లో ఐదుగురు వ్యక్తులు ఆ బాలికతో మాటలు కలిపారు. ఆమెపై అఘాయిత్యానికి ప్లాన్ వేసుకున్నారు. ఇంటి దగ్గర దింపుతా మంటూ నమ్మించి కారు ఎక్కించుకున్నారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి పబ్ వద్ద వదిలేసి వెళ్లారు.
ఆరు రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకోగా.. భయంతో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆమె శరీరంపై గాయాలు చూసి.. తండ్రి మే 31న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ..మొదట వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను ‘భరోసా’ కేంద్రానికి తీసుకెళ్లారు. మహిళా అధికారులు, నిపుణులు సేకరించిన వాంగ్మూలం, వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా తేలింది. .
తర్వాత పోలీసులు విచారణ చేపట్టి.. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 (D), POCSO చట్టంలోని 5,6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లుగా గుర్తించారు.
ఆ ఘటన తరువాత బాధితురాలు షాక్లోనే ఉందని…తనపై దాడికి ఎవరెవరు దాడికి పాల్పడ్డారనేది బాధితురాలు చెప్పలేకపోయిందని డీసీపీ తెలిపింది.