తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఇంట విషాదం నెలకొంది. హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి ఆయన తల్లి శాంతమ్మ గుండెపోటుతో మరణించారు.
శాంతమ్మ అంత్యక్రియలు మహబూబ్ నగర్ పట్టణంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో ఈ రోజు (శనివారం) సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. మంత్రి తల్లి ఆకాల మరణం చెందడం పట్ల పలువురు నేతలు సంతాపం తెలియజేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకురాలన్నారు.
ఇటీవల ఆయన తండ్రి నారాయణగౌడ్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందారు. ఒకే ఏడాదిలోనే మంత్రికి తల్లిదండ్రులిద్దరూ దూరమయ్యారు.
ఆరోగ్యశ్రీని కాపికొట్టి ‘ఆయుష్మాన్ భారత్’: కేసీఆర్