telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు

Revanth-Reddy mp

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రి కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌజ్ పై డ్రోన్ కెమెరా ఉపయోగించారన్న కేసులో రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బుధవారం హైకోర్టు ఆయనకు పలు షరతులతో బెయిల్ ఇచ్చింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.

హైదరాబాద్ శివార్లలోని శంకర్ పల్లి సమీపంలో మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌజ్ కట్టుకున్నారంటూ ఎంపీ రేవంత్ రెడ్డి కొన్ని రోజుల కిందట ఆరోపించారు. కొందరు మీడియా ప్రతినిధులను అక్కడికి తీసుకెళ్లి హడావుడి చేశారు. ఫామ్ హౌజ్ కు సంబంధించినవిగా చెబుతూ కొన్ని ఫొటోలను, పత్రాలను చూపించారు. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Related posts