ఇంతకు ముందు తాము వారానికి ఒకసారి కరోనా పరీక్షలు చేయించుకునేవారమని, ఇప్పుడు మాత్రం ప్రతిరోజు చేయించుకుంటామని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ట్రంప్కి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా పనిచేస్తోన్న అమెరికా మిలిటరీ అధికారి ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటికే ట్రంప్తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్కు కరోనా పరీక్షలు చేయగా వారిద్దరికీ నెగిటివ్ అని నిర్ధారణ అయింది.
ఈ నేపథ్యంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… కరోనా సోకిన తన వ్యక్తిగత భద్రతా అధికారిని శ్వేతసౌధంలో తాను, మైక్ పెన్స్ అరుదుగా కలిసేవారిమని చెప్పారు. ఆ అధికారి చాలా మంచివాడని వ్యాఖ్యానించారు. ఇప్పటికే తాను, మైక్ కరోనా పరీక్షలు చేయించుకున్నామని చెప్పారు. తాను, మైక్తో పాటు శ్వేతసౌధంలోని సిబ్బంది అందరరం ఇకపై ప్రతి రోజు కరోనా వైరస్ పరీక్ష చేయించుకుంటామని తెలిపారు.