మేనిఫెస్టోను పరమపవిత్రంగా భావిస్తూ ఏడాది పాలన సాగించామని సీఎం జగన్ అన్నారు. మీరిచ్చిన అధికారాన్ని ఉపయోగించి, ఆరు కోట్ల ఆంధ్రులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నానని ఉద్ఘాటించారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆయన పార్టీ నేతల సమక్షంలో మరోసారి ప్రమాణం చేశారు.
వైఎస్ జగన్ అనే నేను ఏడాది కాలంగా మీ కుటుంబసభ్యుడిగా, మీ ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నానని దైవసాక్షిగా స్పష్టం చేస్తున్నానని వ్యాఖ్యానించారు.