telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీలో ఎన్నికల కోడ్‌.. రూ. కోటి స్వాధీనం

Hyderabad Police Seize Three Crores

ఢిల్లీలోని అసెంబ్లీ 70 స్థానాలకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. దీంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నిర్వహించిన తనిఖీల్లో అజ్మేరీ గేట్‌ వద్ద పోలీసులు ఓ కారును ఆపారు. కారులో ఉన్న కోటి రూపాయాలను స్వాధీనం చేసుకున్నారు.

డ్రైవర్‌ ఆజాద్‌ సింగ్‌, కారు యజమాని ఆదిత్య అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా విచారణ చేపట్టారు. ఢిల్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ప్రధానంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. 2015లో జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ ఆప్‌ 67, బీజేపీ మూడు స్థానాల్లో గెలిచింది.

Related posts