కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్ కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన అంత్యక్రియలు.. శనివారం మధ్యాహ్నం జరగనున్నాయి. అయితే అమెరికాలో ఉన్న పునీత్ పెద్ద కుమార్తె వందిత వచ్చిన తర్వాత అంతక్రియలు నిర్వహిస్తారు. పునీత్ తల్లిదండ్రులు డాక్టర్ రాజ్కుమార్, పార్వతమ్మ అంత్యక్రియలు జరిగిన సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు జరగనున్నాయి.
బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్కుమార్ పార్థివ దేహానికి అభిమానులు సందర్శనార్ధం ఉంచారు. బరువెక్కిన గుండెలతో తమ అభిమాన హీరో పునీత్ రాజ్కుమార్ను కడసారి దర్శించుకునేందుకు అభిమానులు ఉప్పెనలా తరలివస్తున్నారు. ‘‘అప్పూ.. మిస్.. యూ’’ అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. దేవుడా ఏం తప్పు చేశాడని కోట్లాది మంది అభిమానుల ప్రాణాలను తీసుకుపోయావు అంటూ రోదిస్తున్నారు.
శుక్రవారం ఉదయం 11:30 గంటల సమయంలో జిమ్లో వ్యాయామం చేస్తున్న సమయంలో పునీత్కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆస్ప్రత్రిలో చేర్చారు. కానీ వైద్యులు అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇప్పటికే సీఎం బసవరాజ్ బొమ్మై సహా పలువురు ప్రముఖులు పార్థివ దేహాన్ని సందర్శించారు.
కాగా..పునీత్ మరణంతో కర్ణాటకలో హైలర్ట్ ప్రకటించారు. దాదాపు 6000 మంది పోలీసులతో పాటు 40 KSRP ప్లాటూన్లు, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, RAF ని మోహరించారు .సినిమా థియేటర్ల కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
God, took away the lives of crores of his admirers. What bad did he do🙏 Never in his life, 💔😔
#PuneethRajkumar #PuneethRajkumarFans pic.twitter.com/1netN5OsVN
— KR (@ImKalyanRaksha) October 29, 2021