ఇవాళ తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న కీలక నేతలందరూ సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే.. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బల్కం పేట అమ్మవారి ఆలయంలో ఎల్లమ్మ అమ్మవారికి రెండున్నర కిలోల బంగారు చీరను బహుకరించారు మంత్రి తలసాని, కూన వెంకటేష్ గౌడ్, ఆలయ ఈవో అన్నపూర్ణ. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదినం సందర్భంగా కూన వెంకటేష్ గౌడ్, శివరాంరెడ్డి సహకారంతో రెండున్నర కిలోల బంగారు చీరను అమ్మవారికి సమర్పించామన్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారని.. భవిష్యత్ లో దేశానికి కూడా వారు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు మంత్రి తలసాని.
previous post
next post
కంగన అండగా నిలిచిన సందర్భం ఒక్కటీ లేదు… : తాప్సి