తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ విడుదల అయింది. ఎంసెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ప్రకటించారు.
ఎంసెట్ పరీక్షలు జులై 14, 15, 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. జులై 13న ఈసెట్, జులై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 18, 19, 20వ తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ ఉంటాయని స్పష్టం చేశారు .దీంతో ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్ వాయిదా పడింది.
మే నెలలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరగనున్నందున.. జులైలో నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తు గడువు, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలతో కూడిన నోటిఫికేషన్లు సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి తెలిపారు.
కాగా, ఈ పరీక్షలను 28 రీజనల్ సెంటర్స్ పరిధిలోని 105 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.