భారతీయ సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్న సందర్బంగా ఆమెకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. ప్రధాని జెసిండా మంత్రివర్గంలో చేరనున్న ప్రియాంకకు అభినందనలు అంటూ ఆయన సోమవారం ట్వీట్ చేశారు. న్యూజిలాండ్ దేశంలో ఈ స్థాయికి ఎదిగిన తొలి భారతీయురాలు అంటూ కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
అదే విధంగా తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జెసిండాను కూడా ఆయన అభినందించారు. ప్రియాంక రాధాకృష్ణన్ స్వస్థలం కేరళలోని ఎర్నాకుళం జిల్లా పరవూర్. రామన్ రాధాకృష్ణన్, ఉషా దంపతులకు ఆమె జన్మించారు. అనంతరం ఆ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ప్రియాంకా విద్యాభ్యాసం సింగపూర్, న్యూజిలాండ్లో కొనసాగింది. ఆ తర్వాత ఆమె క్రైస్ట్చర్చ్కు చెందిన రిచర్డ్సన్ ను వివాహమాడింది. 2004 నుండి లేబర్ పార్టీలో చురుకుగా ఉన్నారు.
మోదీ మళ్లీ ప్రధాని అయితే ఏం చేస్తారోనని భయం: శరద్ పవార్