కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ప్రకటించింది. గాంధీభవన్లో రెండోరోజు మాల్కాజ్గిరి నియోజకవర్గ సమీక్షా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్తో సర్వే వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. కిషన్పై సర్వే వాటర్ బాటిల్ విసిరి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. సర్వేను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ అడ్డుకున్నారు.
సర్వే సత్యనారాయణ, కిషన్ పరస్పరం దూషించుకున్నారు. సర్వే సత్యనారాయణ వీధి రౌడీలా ప్రవర్తించాడని, పార్టీ నేతలను తీవ్ర పదజాలంతో దూషించారని కిషన్ ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియాలే కారణమని సర్వే పేర్కొన్నారు. ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేసిన టీ కాంగ్రెస్ నేతలు సర్వేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అధిష్టానం ఆదేశాల మేరకు సర్వేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆపార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం ప్రకటించింది.