ఏపీలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలోని లేడీస్ హాస్టల్లోకి అబ్బాయి చొరబడి రాతంత్రా గడిపిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన మర్చిపోకముందే అటువంటి మరో ఘటన తెలంగాణలో జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలోని ఓ లేడీస్ హాస్టల్లోకి ఈ నెల 17న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఓ యువకుడు చొరబడ్డాడు. స్నేహితురాలి గదిలో రాత్రంతా గడిపాడు. వారి ఇద్దరూ కుమురం భీం జిల్లాలోని ఒకే గ్రామానికి చెందినవారని, వారి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని సమాచారం. దీంతో ప్రియురాలిని చూసేందుకు ప్రహరీ దూకి, వెంటిలేటర్ గుండా లోపలికి ప్రవేశించాడు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమ్మాయి గదిలో మరో ముగ్గురు ఉన్నప్పటికీ విషయం వెలుగులోకి రాలేదు. మరుసటి రోజు గదిని శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది అబ్బాయిని గమనించి ప్రిన్సిపాల్కు సమాచారం అందించారు. దీంతో ఆయన ఉన్నాతాధికారులు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అబ్బాయి, అమ్మాయిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు.
కరీంనగర్ కేంద్రంగానే మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది : ఈటల