telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి: సుజనా చౌదరి

4 directors arrested from sujana chowdary offices

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనపై బీజేపీ నేత సుజనా చౌదరి స్పందించారు. అమరావతి కేంద్రంగా జరుగుతోన్న గందరగోళాన్ని తాను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్ల ఇచ్చిందని సుజనా చౌదరి అన్నారు.

అమరావతి విషయంలో ప్రభుత్వం లిఖితపూర్వక ప్రక్రియ మొదలుపెడితే అప్పుడు కేంద్రం పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అమరావతి విషయంలో జరుగుతున్న గందరగోళాన్ని ఇప్పటికే కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానంటూ ఆయన ట్వీట్ చేశారు.

Related posts